ఇంటింటికి వైఎస్సార్ టిపి కార్యక్రమంలో పాల్గొన్న మద్దెల, సంక్షేమం రాజ్యం షర్మిలమ్మ ద్వారానే

Published: Friday May 27, 2022

మధిర రూరల్ మే 26 ప్రజా పాలన ప్రతినిధి తెలంగాణ రాష్ట్రంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే  వైయస్ షర్మిలమ్మ ముఖ్యమంత్రి కావాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ దళిత విభాగం జిల్లా అధ్యక్షులు రిటైర్డ్ సీఐ మద్దెల ప్రసాదరావు చింతకాని మండల అధ్యక్షులు వాక వీరారెడ్డి పేర్కొన్నారు. గురువారం మధిర నియోజకవర్గం పరిధిలోని మధిర చింతకాని మండలాల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు ఇప్పటికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దెల ప్రసాదరావు వాక వీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమం కావాలంటే షర్మిలమ్మ రావాలి అనే నినాదంతో ఇంటింటికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అనే కార్యక్రమాన్ని మధిర నియోజకవర్గంలో ప్రారంభించినట్లు వారు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో రైతులకు ఒకే సారి రుణమాఫీ చేశారని, పత్తి విత్తనాల ధరలను తగ్గించారని ఫీజు రియంబర్స్మెంట్, 108, 104, ఉచిత విద్యుత్, ప్రాజెక్టుల నిర్మాణం అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వటం లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని, మైనార్టీలకు రిజర్వేషన్లు అందించారని వారు గుర్తు చేశారు. ప్రస్తుత టిఆర్ఎస్ పాలనలో నిరుద్యోగ భృతి లేదని, ఎనిమిదేళ్లుగా కొత్త పెన్షన్లు ఇవ్వటం లేదని, రుణమాఫీ లేదని, ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వడంలేదని వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం కావాలంటే షర్మిలమ్మ రావాలని నినాదాన్ని గ్రామ గ్రామాన మారుమ్రోగే విధంగా నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఇంటింటికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.