ప్రమాద బాధితునికి ఆర్థిక సహాయం

Published: Thursday December 16, 2021

కొడిమ్యాల, డిసెంబర్ 15 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండలం లోని గౌరపూర్ గ్రామానికి చెందిన మ్యాక రవీందర్ ఇటీవలి కాలంలో ప్రమాదం జరిగి గాయలు కాగా బుధవారం గౌరపూర్ గ్రామంలో రవీందర్ ను పరామర్శించి పుణుగోటి కృష్ణారావు  ఐదువేల రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కృష్ణారావు తో పాటు గౌరపూర్ సర్పంచ్ బొడ్డు విజయలక్ష్మి -రమేష్, సర్పంచ్ గరిగంటి మల్లేశం, నాయకులు రంజిత్ తదితరులు పాల్గొన్నారు