జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం

Published: Friday February 19, 2021

జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలేశ్వర్ గుప్త
వికారాబాద్ జిల్లా ప్రతినిధి 18 ( ప్రజాపాలన ) : సిఎం కేసిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని అనంతగిరి దేవాలయం ప్రాంగణంలో అన్నదానం నిర్వహించామని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలేశ్వర్ గుప్త గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర విధాత, అపరభగీరథుడు, బంగారు తెలంగాణ నిర్మాణ ప్రదాత, నిరంతరం ప్రజాశ్రేయస్సుకై పరితపించే సిఎం కేసిఆర్ ఇలాంటి జన్మదినాలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా రైస్ మిల్లెర్స్ అసోసియేషన్ తరపున శ్రీ అనంతపాదనాభ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు మిల్లర్లు పెద్దసంఖ్యలో  పాల్గొన్నారు.