మానసిక వికలాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ

Published: Wednesday May 26, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధులు : మండల పరిధిలోని టేకుల సోమవారం గ్రామంలో చిరాగ్ పౌండేషన్ యూఎస్ఏ వారి సహకారంతో యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో మంగళవారం రోజున మానసిక వికలాంగులు సంస్థ వారికి 11 వేల రూపాయల విలువ గల నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షులు మల్లగారి శీనివాస్, వలిగొండ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బచ్చు శ్రీనివాస్, మానసిక వికలాంగుల సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.