బాబు జగ్జీవన్ రామ్ ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళి
Published: Wednesday April 06, 2022
మధిర ఏప్రిల్ 5 ప్రజాపాలన ప్రతినిధి నియోజకవర్గపరిధిలో ఎర్రుపాలెం మండలం కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధుడు, జనం కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్గా, ఉప ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. సమసమాజ నిర్మాణం కోసం జీవితాంతం పోరాడిన చైతన్య మూర్తి, భారత్ మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ దళిత హక్కుల పరిరక్షకులు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిగా మనందరం బడుగువర్గాల అభ్యున్నతి కోసం కృషి చేద్దామని సూచించారు. సామాజిక న్యాయం కోసం జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం దళిత జాతిని జాగృతం చేసిందని అన్నారు..ప్రతి ఒక్కరు బాబు జగ్జీవన్ రామ్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బండారు నరసింహారావు, శీలం శ్రీనివాసరెడ్డి సర్పంచ్ భుసిపల్లి వెంకటరెడ్డి నాయకులు షేక్ ఇస్మాయిల్, షేక్ జానిభాషా, సామినేని హనుమంతరావు, కె పాండురంగారావు, ఆర్ నాగబాబు, కంచర్ల వెంకటనర్సయ్య, దేవరకొండ శ్రీను, డి రాజివ్ గాంధీ, పిల్లి బోస్, యన్నం పిచ్చిరెడ్డి, జానకి శివయ్య, వి వెంకటరెడ్డి, గుడేటి బాబు, నండ్రు జనార్దన్, డి నారాయణ, కోట కృష్ణయ్య, పి వెంకటేశ్వరరావు, వర ప్రసాదు తదితరులు పాల్గోన్నారు....
Share this on your social network: