రెండవ సతీష్ రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించిన బూర్గంపహాడ్ జడ్పీటీసీ కా

Published: Wednesday January 11, 2023
బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో మిత్రుని జ్ఞాపకార్ధంగా లక్ష్మీపురం ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రెండవ  సతీష్ రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా పాల్గొని టోర్నమెంట్ ని ప్రారంభించిన  బూర్గంపహాడ్ జడ్పీటీసీ శ్రీమతి కామిరెడ్డి శ్రీలత  .అనంతరం జడ్పీటీసీ శ్రీలత  మాట్లాడుతూ మిత్రుని జ్ఞాపకార్థంగా లక్ష్మీపురం ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం చాలా గొప్ప విషయమని వారి మిత్రులను కొనియాడారు.తమ చిన్ననాటి స్నేహితున్ని మర్చిపోకుండా కలకాలం గుర్తుంచుకునేందుకు అతని పేరుతో ప్రతియేటా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాల సంతోషకరమైన విషయమని వారి మిత్ర బంధాన్ని అభినందించారు.అలాగే క్రిడలు అనేవి యువతలో దాగివున్న నైపుణ్యాన్ని వెలికితీసి వారి ప్రతిభను ప్రపంచ నలుమూలలు చాటిచెప్పడానికి దోహదపడతాయని తెలిపారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ గ్రామ కమిటి అధ్యక్షులు పోతిరెడ్డి గోవింద రెడ్డి ,స్థానిక వార్డుసభ్యులు పాలం దివాకర్ రెడ్డి ,చింతా వెంకట్రామిరెడ్డి,స్థానికులు ఆవుల నాగార్జున రెడ్డి ,కటుకూరి వెంకన్న,ఆర్గనైజింగ్ సభ్యులు బాదం గణేష్ రెడ్డి ,యారం పున్నారెడ్డి  చగర్లమూడి.జగదీష్  దుగ్గు శ్రీనివాస రెడ్డి ,దుగ్గు రాజశేఖర్ రెడ్డి ,పడిదెల శ్రీను బందెల శ్రీను ,పాలం ప్రకాష్ రెడ్డి పేరం సంజీవ రెడ్డి ,బొడ్డు రామాంజి రెడ్డి ,ఆవుల పవన్ కుమార్ రెడ్డి ,బిజ్జం అంజిరెడ్డి ,ఉమ్మలరెడ్డి బాలశేఖర్ రెడ్డి ,యారం పూర్ణ చందర్ రెడ్డి ,యల్లాంకి నాగేశ్వర్ రావు ,ఆలేటి వెంకటేష్(గిరి)గారు,జక్క.కార్తిక్  ,కన్నెకంటి యాకుబ్ రెడ్డి , క్రిడాకారులు మరియు తదితరులు పాల్గొన్నారు..