నాటు బాంబు పేలడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు
Published: Monday July 26, 2021
వికారాబాద్, జులై 25, ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రంలో ఓ ఇంట్లో అనుమానాస్పదంగా పేలుడు జరగడంతో ఓ వ్యక్తికి తీవ్ర రక్త గాయాలైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పెద్దముల్ గ్రామానికి చెందిన బ్యాగరి యదప్ప ఇంటి ముందు అనుమానాస్పదంగా పేలుడు జరగడంతో యాదప్ప తనయుడు వెంకటేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంకటేష్ ను తాండూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. స్థానికులు నాటు బాంబు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Share this on your social network: