యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ కు ఘన సన్మానం

Published: Thursday February 02, 2023
* కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భానూరి ఉపేందర్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 01 ఫిబ్రవరి ప్రజాపాలన : రాహుల్ గాంధీ చేపట్టిన కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్రలో ఆద్యంతం పాల్గొని వికారాబాద్ చేరుకున్న
యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కోల్కుంద సంతోష్ కు ఘన సన్మానం నిర్వహించామని చేవెళ్ళ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భానూరి ఉపేందర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ జోడో పాదయాత్రను  దిగ్విజయంగా పూర్తి చేసుకొని బుధవారం వికారాబాద్ కు విచ్చేసిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని  యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కోల్కుంద సంతోష్ ను వారి స్వగృహంలో ఘనంగా సన్మానించామని అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బిల్లపాటి రాజశేఖర్ రెడ్డి, పులుమద్ది గ్రామ మాజీ సర్పంచ్ శివయ్య ముదిరాజ్, మాజీ ఎంపిటిసి మల్లేశం, ఉద్యమ కారుడు సామల కృష్ణా రెడ్డి, నాగేష్ కొత్తగడి, కరుణాకర్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.