సాహిత్య ప్రయోజనం పై విస్తృతోపన్యాసం : వేమురాములు

Published: Wednesday April 27, 2022
మధిర ఏప్రిల్ 26 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడుప్రభుత్వ డిగ్రీ కళాశాల మధిర నందు తెలుగు విభాగం ఆధ్వర్యంలో "సాహిత్య ప్రయోజనం అనే అంశం మీద విస్తృతోపన్యాసం ఏర్పాటు చేయటం జరిగింది. ప్రముఖ రచయిత, వక్త తెలుగు పండితులు శ్రీ వేము రాములు విస్తృతోపన్యాసం చేశారు. సాహిత్యం వల్ల ప్రజలలో మార్పు తీసుకరావచ్చని అనేక మార్లు రుజువైందని, కనుక ప్రాచీన కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు అనేక మంది రచయతలు సాహిత్యానికి సేవ చేసారు. విద్యార్ధినీ విద్యార్ధులు మీరు కూడా భవిష్యత్తులో తెలుగు సాహిత్యాన్ని మరింత పురోభివృద్ధి చెందేలా మీ వంతు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల తెలుగు విభాగాధిపతి శ్రీమతి శీలం ఇందిర, ప్రిన్సిపాల్, ఎ.ఎల్.ఎన్.శాస్త్రి, వైస్ ప్రిన్సిపాల్ కె.రవికుమార్ మరియు ఇతర అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమ అనంతరం వేము రాములుని ఘనంగా సన్మానించారు.