హమాలీలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన రేట్లు జీవోను వెంటనే విడుదల చేయాలి

Published: Saturday February 20, 2021

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శీలం నరసింహారావు డిమాండ్

 

మధిర, ఫిబ్రవరి 19, ప్రజాపాలన: సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శీలం నరసింహారావు డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం హమాలీలకు పెంచిన రేట్లు GO ను వెంటనే విడుదల చేయాలని సివిల్ సప్లై హమాలీల సమ్మె చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు సివిల్ సప్లయ్ గొడవ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా శీలం నర్సింహారావు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం హమాలీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరచాలని అదేవిధంగా ఇచ్చిన హామీల జీవో పత్రాన్ని వెంటనే విడుదల చేయాలని, 1/1/2020నుండి పెండింగ్ రేట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో హమాలీల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు తేలప్రోలు రాధాకృష్ణ, పడకంటి మురళి, గోగుల నాగమల్లేశ్వరరావు, పల్లపు గోపి, నాగరాజు సివిల్ సప్లై హమాలీల తదితరులు పాల్గొన్నారు.