రైతులకు నష్టపరిహారం చెల్లించాలి.. బీజేపీ మండల అధ్యక్షులు రామారావు..

Published: Friday July 29, 2022
తల్లాడ, జులై 28 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామంలో నకిలీ వరి విత్తనాలు సాగు చేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ తల్లాడ మండల అధ్యక్షులు ఆపతి వెంకట రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించి డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం అందించారు. అనంతరం విత్తనాలు అమ్మిన పుల్లారెడ్డి దుకాణం వద్ద రైతులతో కలిసి ఆందోళన నిర్వహించారు. 1061 వరిరకం విత్తనాలు రైతులు సాగు చేస్తే ఇప్పటివరకు మొలకెత్తలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాడవల్లి నాగేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area