మాస్టర్ ప్లాన్ లోసెంటు భూమి రైతులది పోనివ్వ --ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

Published: Monday January 16, 2023

జగిత్యాల, జనవరి 14 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణ మాస్టర్ ప్లాన్ తో ఏ ఒక్క రైతుకు నష్టం కలగకుండా చూస్తానని, ముసాయిదా రద్దు చేయిస్తానని, రైతుల సెంటు భూమి పోనివ్వనని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. 20 ఏండ్లకోసారి మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం అదేశాలిస్తుందని అ దిశలోనే ఓసంస్థ సర్వే చేసిందని ఎమ్మెల్యే చెప్పారు. మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో కొందరు అధికారుల పొరపాటు జరిగిందన్నారు. ఇది కేవలం ముసాయిదా మాత్రమేనని ఇందులో మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుందన్నారు. అభ్యంతరాలకు 60 రోజుల టైం ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. రాజకీయ అవకాశవాదులు తమ పబ్బం గడుకోవడానికి రైతులను రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. రైతులది సెంటు భూమి పోనివ్వనని హామీ ఇస్తున్నామని ఎమ్మెల్యే న్నారు. అవసరమైతే ముసాయిదాను రద్దు చేయిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నట్లుగా నేనే బాధ్యత వహిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. ఈ సమావేశంలో మునిసిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు బొడ్ల జగదీష్, అల్లే గంగా సాగర్, అవారి శివకేసరి బాబు, నాయకులు వొళ్ళం మల్లేశం, సింగారావు, వల్లెపు మోగిలి, బీర్ ఎస్ పట్టణ అద్యక్షులు గట్టు సతీష్ తోపాటు పలువురు ఉన్నారు.