లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

Published: Thursday January 13, 2022
బోనకల్లు జనవరి 12 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని రావినూతల గ్రామంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రావినూతల గ్రామ సర్పంచి కొమ్మినేని ఉపేందర్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జున రావుల చొరవతో లోక్ సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సిఫార్సు మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను రావినూతల గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు చేతుల మీదగా నామ క్యాంప్ కార్యాలయం నందు అందించడం జరిగింది. షేక్ అమృ దీన్ 60000 రూపాయలు, నరసింహారావు 32000 రూపాయలు చెన్నకేశవ రాజు 55000 రూపాయలు, గల లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో రావినూతల గ్రామ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జునరావు, మైనార్టీ డివిజన్ నాయకులు షేక్ సైదా, ఎస్టీసెల్ మండల అధ్యక్షులు మూడవత్ సైదా, షేక్ కరీం, అజ్మీర తులిస మరియు బోయినపల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.