నాగేశ్వరరావుకు నివాళులు అర్పించిన నాయకులు

Published: Friday May 20, 2022
తల్లాడ, మే 19 (ప్రజాపాలన న్యూస్):
 *తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఇసనపల్లి నాగేశ్వరరావు (52) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న అన్నారుగూడెం గ్రామ సర్పంచ్ మారెళ్ల మమత, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కూచిపూడి వెంకటేశ్వర రావు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు (కేవీ) ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపం సానుభూతిని వ్యక్తం చేశారు. నివాళులర్పించిన వారిలో నాయకులు తుమ్మలపల్లి రమేష్, పొన్నం కృష్ణయ్య, మారెళ్ళ మల్లికార్జునరావు, దుగ్గినేని వెంకటయ్య, గోవిందు శ్రీనివాసరావు (ట్రాక్టర్), గుమ్మా వలరాజు, సిపిఎం నాయకులు పులి వెంకట నరసయ్య తదితరులు ఉన్నారు* .