బోడుప్పల్లో మదర్ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

Published: Tuesday October 11, 2022
మేడిపల్లి, అక్టోబర్ 10 (ప్రజాపాలన ప్రతినిధి)
 బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎన్టీఆర్ విగ్రహం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన మదర్ హాస్పిటల్స్ మరియు ఐవిఎఫ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మరియు హుస్నాబాద్ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ పాల్గొని ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ ప్రశాంతి రెడ్డి, డాక్టర్ నవీన మాట్లాడుతూ బోడుప్పల్,పీర్జాదిగూడ కార్పొరేషన్ ల ప్రాంతాలలోని  గర్భస్థ మహిళలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మరియు పిల్లలు లేని తల్లిదండ్రులకు ఐవిఎఫ్ సెంటర్ ద్వారా టెస్ట్ ట్యూబ్ బేబీలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.