తాటి చెట్టు పై నుండి జారిపడిన గీత కార్మికుడు శంకరపట్నం మార్చ్ 10 ప్రజాపాలన రిపోర్టర్ :

Published: Saturday March 11, 2023
శంకరపట్నం మండల కేంద్రం కేశవపట్నంలో మార్క లింగయ్య గౌడ్ అనే గీత కార్మికుడు శుక్రవారం తాటి చెట్టు పై నుండి ప్రమాదవ శాత్తు జారీ పడిపోయాడు. ప్రక్కనే ఉన్న మరో గీత కార్మికులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన బాధితుడిని అంబులెన్స్ లో హుజరాబాద్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గాయాల పాలైన బాధితుడిని పరిశీలించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం జమ్మికుంట ఆసుపత్రికి సిఫారసు చేశారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం శనివారం శస్త్ర చికిత్స జరుపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.