ఘనంగా సంత్ రవిధాస్ జయంతి వారోత్సవాలు

Published: Wednesday February 16, 2022
మంచిర్యాల జిల్లా (తాండూర్), పిబ్రవరి 15, ప్రజాపాలన : మండలంలోని సేవాజ్యోతి అనాథ శరణాలయంలో బిజెపి ఎస్ సి మోర్చ ఆధ్వర్యంలో అరటి పండ్లు బ్రేడ్ స్వీట్స్ పంచి పెట్టడం జరిగింది. ఈ సందర్భంలో బిజెపి ఎస్ సి మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి పాగిడి చిరంజీవి మాట్లాడుతూ సంత్ రవిదాస్ కవులలో ఆధ్యాత్మిక భావాలు కాకుండా సామాజిక భావాలు. బానిస భావాలను వ్యతిరేకించారు. మానసిక భానిసత్వాన్ని కుల భానిసత్వాన్ని శారీరక భానిసత్వాన్ని వ్యతిరేకించారు మనిషి స్వతంత్రుడై గౌరవమైన ఆలోచన్లతో జీవించాలని తలవంచి జీవించే ఆలోచన్లు నిరాకరించారు. ప్రతి మనిషి  చైతన్యంతో ఉండాలని వారు అన్నారు. రవి సంతుదాస్ తన కవిత్వంతో తన పాటలతో సమాజాన్ని మేలుకొలిపారు. ఆధ్యాత్మిక సంత్ రవిధాస్ అంటరాని వారి కోసం ఉద్యమాన్ని నడిపారు. సాంఘిక అభివృద్ధి కోసం కృషి చేశాడు. ఈ కృషిలో సామాన్యులే కాకుండా శ్రీ కృష్ణుని భక్తురాలైన అంతపురా వాసి మీరభాయ్ లాంటి వారెందరో రవిధాస్ భక్తి ఉద్యమంలో భాగస్వాములయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్ సి మోర్చ మండల అధ్యక్షులు దగం శ్రీకాంత్ రాష్ట్ర నాయకులు  చిలువెరి శేషగిరి, జిల్లా కార్యవర్గ సభ్యులు కేసెట్టి విజయ్, అసెబ్లీ నాయకులు చిలుముల శ్రీకృష్ణదేవరాయలు, మండల ప్రధాన కార్యదర్శి దూడపక భారత్, ఉప అధ్యక్షులు కోమడ్ల  శ్రీనివాస్, బి.సి. మోర్చ మండల అధ్యక్షులు తాండూరు సాయిరాం, రాచర్ల సాయి రామ్ బాపు, గంగారాం, సేవా జ్యోతి నిర్వాహకులు గజేల్లి శ్రీదేవి మల్లేషం  తదితరులు పాల్గొన్నారు..