జెసిబితో చెత్తాచెదారం తొలగిస్తున్న కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్

Published: Thursday July 08, 2021
మేడిపల్లి, జులై 7 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ చెంగిచెర్లలో స్థానిక కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ మున్సిపల్ సిబ్బందితో కలిసి జెసిబితో ఖాళీ స్థలాలలో చెత్త చెదారంతో పాటు పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో పచ్చదనం పరిశుభ్రతే థేయ్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. డివిజన్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు.