మైనార్టీ గురుకుల వసతి గృహాన్ని తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి

Published: Wednesday October 19, 2022

మధిర  అక్టోబర్ 18 (ప్రజా పాలన ప్రతినిధి) మండలంలో మునగాల గ్రామపంచాయతీ నందు గల మైనారిటీ గురుకుల వసతి గృహాన్ని మంగళవారం మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల  విద్యార్థులకు వడ్డించే ఆహారాన్ని పాఠశాల పరిసరాలను పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు సీజనల్ వ్యాధులు సోకకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించారు. అంతేకాకుండా పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మధిర మండల పరిషత్ అభివృద్ధి అధికారి కుడుముల విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.