యాదాద్రి భువనగిరి జిల్లా కుల దురహంకార హత్య నిందితుడిని శిక్షించాలి

Published: Wednesday April 20, 2022
ఎస్ ఎఫ్ ఐ...ఇబ్రహీంపట్నం మండల ఉపాధ్యక్షులు ఏర్పుల తరంగ్
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 19 ప్రజాపాలన ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రామకృష్ణ భార్గవ్ ఇలా కులాంతర వివాహం చేసుకున్నందుకు అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు రామకృష్ణ అతి దారుణంగా హత్య చేయడం జరిగింది ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుల వర్గ సామాజిక సంఘాలు పరువు హత్యను ఖండిస్తున్నా యి.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రామకృష్ణ భార్య భార్గవి కి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి అని. హత్యా నిందితులను కఠినంగా శిక్షించాలని, రామకృష్ణ కేసులో పోస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కుల విపక్షతో రామకృష్ణను హత్య చేయడం దారుణం వారి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని. రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులాంతర వివాహాలకు అండగా ఉండాలని ఎస్ ఎఫ్ ఐ గా డిమాండ్ చేశారు.