రాష్ట్రస్థాయి పామాయిల్ రైతు సంఘం అధ్యక్షుడిగా

Published: Monday October 10, 2022
ఆలపాటి ప్రసాద్" 
 అశ్వారావుపేట     ప్రజాపాలన.(ప్రతి నిధి) అశ్వారావుపేట మండల కేంద్ర లోని స్థానిక గిరిజన భవనంలో పామాయిల్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రైతులు పాల్గొన్నారు. వీరిలో ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం మండలానికి ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లను ఎన్నుకొన్నారు. వారిలో నుండి రాష్ట్ర కమిటీ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. పామాయిల్ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడిగా దమ్మపేట మండలానికి చెందిన ఆలపాటి ప్రసాద్, ను ప్రధాన కార్యదర్శిగా అశ్వరావుపేటకు చెందిన కోటగిరి సీతారామస్వామి , కోశాధికారిగా బండి గురువారెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎడ్ల స్వామి రెడ్డి,  సహాయ కార్యదర్శిగా మారుపల్లి అంజయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి స్వామినేని హరిప్రసాద్, ని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమం కి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని  రైతులు రాజకీయాల ప్రముఖులు జూపల్లి రమేష్,చిట్టూరి ఫణీంద్ర, ఉపాద్యాయుల ప్రకాష్, మహిపాల్, చంటి,నార్ల పాటి రాములు, జుజ్జారపు రాంబాబు, యన్. సత్యం, కేదార్నాథ్, నిర్మల పుల్లారావు, రామారావు, నర్శింహరావు తరులు పాల్గొన్నారు.