అరెస్టులతో మా ఉద్యమాన్ని ఆపలేరు ఖబర్దార్

Published: Tuesday July 20, 2021
గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ శ్రీనివాస్ నాయక్
పరిగి,19 జూలై ప్రజాపాలన ప్రతినిధి: అరెస్టులతో మా ఉద్యమాన్ని ఆపలేరు గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ అన్నారు. జి విఎస్ ఎల్ హెచ్ పి ఎస్ పిలుపు మేరకు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి ని కలుద్దాం అనే కార్యక్రమం ఉండగా పోలీసులు అరెస్టు చేసి గోషమాల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు అన్నారు. ఈ సందర్భంగా రాథోడ్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కు నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరాహార దీక్షలు చేయకుండా పోలీస్ ఆక్ట్ 30 సాకుగా చూపుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ బంజార, ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్, ఎల్ హెచ్ పి ఎస్ వికారాబాద్ జల్లా అద్యక్షులు గోవింద్ నాయక్,ప్రధాన కార్యదర్శి సూర్య నాయక్, కుల్కచర్ల మండల అధ్యక్షులు ప్రకాష్ నాయక్ జిల్లా కార్యదర్శి అరుణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.