బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన మేయర్ జక్క వెం
Published: Tuesday August 23, 2022
మేడిపల్లి, ఆగస్టు22 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మాంగల్య షాపింగ్ మాల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన 'బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ కార్యాలయాన్ని మేయర్ జక్క వెంకట్ రెడ్డి,సీనియర్ నాయకులు పప్పుల అంజిరెడ్డి,కార్పొరేటర్లు భీమ్ రెడ్డి నవీన్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి,కౌడే పోచయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 'బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్' ను పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రారంభించడం సంతోషకరమని, వివిధ రంగాల్లో విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆసక్తి చూపేవారికి 'బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఓ చక్కటి అవకాశం అని అన్నారు.తదనంతరం బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ యజమాన్యం వి.సురేష్ కుమార్,జి.సాయికుమార్,పి.సంతోష్ కుమార్ ను అభినందించారు.ఈ కార్యక్రమంలో యూత్ ప్రభు మరియు నాగార్జున రెడ్డి,శ్రీధర్ గౌడ్,అజయ్ కుమార్,శ్రీనివాస్ హరికృష్ణ,సంబిరెడ్డి,
సభిర్ హుస్సేన్,శ్రీకాంత్ పటేల్,అఖిల్ సూర్య,హరీష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: