ఎమ్మెల్సీ అభ్యర్థి తాత మధుకి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో అభినందనలు తెలిపిన మధ
Published: Wednesday November 24, 2021
మధిర నవంబర్ 23 ప్రజాపాలన ప్రతినిధి : టిఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధు ని ఈరోజు ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తా రు నాగేశ్వరరావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ ఎంపీపీ మెండెం లలిత కౌన్సిలర్ మల్లాది వాసు తదితరులు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రైతు పక్షాన అండగా ఉండే పార్టీ అని అదేవిధంగా అన్ని వర్గాల కలుపుకుంటూ అన్ని విధాల ప్రజలకు ప్రభుత్వానికి రథసారధి కెసిఆర్ నాయకత్వం ముందుకెళ్తుందని ముందు ముందు టిఆర్ఎస్ ప్రభుత్వానికి దేశములో పలు రాష్ట్రాలు తెలంగాణ అభివృద్ధిచూసి ఆదర్శంగా తీసుకుంటున్నాం అని తెలిపారు మండలఉపాధ్యక్షుడు మెండెం వెంకన్న ఉన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొండితోక లత కోటేశ్వరావు కనుమూరు వెంకటేశ్వరావు పంబా సాంబశివరావు రావూరు శ్రీనివాసరావు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
Share this on your social network: