తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర

Published: Monday January 16, 2023
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం రమేష్ జన్మదిన వేడుకలు తాండూరు పట్టణంలోని ఎంపిటి ఫంక్షన్ హాల్లో వైభవంగా జరిగాయి. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం రమేష్ పుట్టినరోజు సందర్భంగా ఊరేగింపుగా బయలుదేరి కాళికాదేవి టెంపుల్ భద్రాచలం టెంపుల్ మీదుగా ర్యాలీగా ఎంపీటీ  వరకు వచ్చారు .దైవ దర్శనం చేసుకోవడానికి కాళికాదేవి టెంపుల్ కు బద్రేశ్వర టెంపుల్ కు వెళ్లగా తాళాలు వేశారని అన్నారు. మా కుటుంబం రాష్ట్రానికి అనేక మంత్రులుగా ఎమ్మెల్యేగా అనేక సేవలు   అందించిందని వారి బాటలోనే నేను కూడా సేవలు ప్రజలకు అందిస్తానని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర నాయకులు రమేష్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మాట్లాడుతూ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకులు ధారాసింగ్ పాండు నియోజకవర్గ నాయకులు జనార్దన్ రెడ్డి ప్రభాకర్ గౌడ్ తదితరులు ఇంత గ్రామాల నాయకులు పదుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.