ఆర్ సీ ఎం చర్చి లో ఘనంగా క్రీస్తు పునరుత్థాన మహోత్సవం

Published: Monday April 10, 2023
 అశ్వరావుపేట ప్రజా పాలన ప్రతినిధి అశ్వరావుపేట మండలంలోని స్థానిక గుడ్ న్యూస్ స్కూల్ ఆవరణంలో ఉన్న ఆర్ సీ ఎం చర్చిలో క్రీస్తు పునరుత్థాన మహోత్సవాన్ని ఫాదర్ జోషి, ఫాదర్ టోనీ ప్రసన్న గారి ఆధ్వర్యంలోఘనంగా నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి పూజలు చేసి కొత్త వెలుగు ,కొత్త నీరు తయారుచేసి అందరూ కూడా కొవ్వొత్తులు వెలిగించుకొని క్రీస్తు పునరుత్థానాన్ని ఆహ్వానిస్తూ పూజలో పాల్గొన్నారుఈ సందర్భంగా ఫాదర్ టోనీ ప్రసన్న మాట్లాడుతూ ప్రజలందరి కొరకు క్రీస్తు మరణించి మూడవ నాడు పునరుత్థానమైన రోజున ఈస్టర్ పండుగగా కొనియాడతారని, కొత్త వెలుగు అందరి జీవితాలలో వెలుగులు నింపాలని, అందరూ కూడా క్రీస్తు మార్గంలో నడవాలని ఆయన కోరారు. పలు చర్చిలలో కూడా క్రీస్తు పునరుత్థాన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి గుడ్ న్యూస్ స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ డెల్బీ సిస్టర్ రోస్లీ చర్చి పాస్టర్లు డి చార్లెస్ ,జోసెఫ్, డి శ్యాంసుందర్, డేవిడ్ పాల్ ప్రభావతి గార్లు సంఘ పెద్దలు జుజ్జారపు రాంబాబు,యన్ రవీంద్ర,బి రమాదేవి, జె అప్పారావు, వి పార్వతి, టి నిర్మలమ్మ,వై రాములమ్మ ప్రసాదు,యన్ మధు, అచ్చుతాపురం, పేరాయి గూడెం, నెహ్రు నగర్, అనంతరం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.