ప్రజగోస బిజెపి భరోసా కార్యక్రమం

Published: Thursday February 23, 2023

జన్నారం, ఫిబ్రవరి 22, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోనీ కిష్టాపూర్ గ్రామలలో ప్రజాగోష బీజేపీ భరోసా కార్యక్రమం నిర్వహించారు. బుధవారం మండల అధ్యక్షులు గోలిచంద్, అధ్యక్షతన శక్తి కేంద్ర ఇంచార్జ్ గాజుల దేవేందర్, అధ్యర్యంలో బిజెపి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా. సమావేశంలో ముఖ్య అతిథిగా వచ్చిన ఖానాపూర్ అసెంబ్లీ నాయకులు అజ్మీరా హరినాయక్ మాట్లాడుతూ కెసిఆర్ పాలనను, స్థానిక ఎమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్ వైఫల్యాలను ఎత్తిచూపుతామన్నారు. కేంద్రంలోని బీజేపీ పాలనలో ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తుందో తెలియజేసారు. అదేవిధంగా చింతలపల్లి బాదం పెళ్లి కేంద్రం ఇన్చార్జి బూత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రజాగోష బీజేపీ భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాథోడ్ రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ పథకాలు ప్రజలకు వివరించారు బిఆర్ఎస్ వైపల్యాలకు ప్రజలకు తెలిపారు.  ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు 281 తిరుపతి,282 శ్రావణ్, 283 ముంజంపల్లి సాయికుమార్, బిజెపి నాయకులు రితిష్ రాథోడ్, జిల్లా ఎస్టి మోర్చా నాయకులు బద్రి, బీజేవైఎం జిల్లా నాయకులు కొండపల్లి మహేష్, మండల ప్రధాన కార్యదర్శి సురేష్, బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజలు బాదం పెళ్లి చింతలపల్లి బిజెపి నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.