*వాడవాడలా భోగి మంటలు*

Published: Monday January 16, 2023
మధిర  జనవరి 14 (ప్రజా పాలన ప్రతినిధి) పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో శ్రీ బాల గణేష్ యూత్ లడక బజార్ వారి ఆధ్వర్యంలో శనివారం భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అరిగే రజనీ మాట్లాడుతూ
భోగి అందరి జీవితాల్లో భోగ బాగ్యాలను తీసుకురావాలని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ తమలోని ప్రతికూలతలను విడిచిపెట్టి నూతనోత్సాహం తో ముందుకు వెళ్లాలని సూచిస్తూ అందరూ ఆనందోత్సాహాలతో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని కోరారు. ఈ
కార్యక్రమంలో కూరపాటి సీతామహాలక్ష్మి, కాంతాల కమల,  ఓట్లసత్యవతి, పెంట్లవల్లి రమాదేవి, పద్మజ్యోతి, లాస్య, పరిమళ తదితరులు పాల్గొన్నారు.