రైతులకు అండగా వుండేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే
రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు
కోరుట్ల, జూన్ 03 (ప్రజాపాలన ప్రతినిధి):
పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం రోజున రచ్చబండ లో భాగంగా మోహనరావు పేట మరియు నాగులపేట గ్రామంలో రైతులు మరియు రైతు కూలీలతో సమావేశమై రైతులకు రుణమాఫీ ప్రతి పంట కు మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కొంటామని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు రైతులతో మాట్లాడారు. రానున్న రోజుల్లో రైతులకు రైతుకూలీలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టి అని మీ మద్దతు కాంగ్రెస్ పార్టి వైపు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమం లో గ్రామ కమిటీ అధ్యక్షులు కిషన్ రావు, మండల కాంగ్రెస్ అద్యక్షులు కాంతం రాజం, సరికెల నరేష్, ఎస్సి సెల్ మండల అద్యక్షులు మంథని గంగ నర్సయ్య, జక్కుల రాజం, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు పెరుమండ్ల సత్యనారాయణ, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ అద్యక్షులు తిరుమల గంగాధర్, ప్రధాన కార్యదర్శి తుపాకుల బాజన్న, కార్యదర్శులు మ్యకల నర్సయ్య, దండవెని వెంకట్ , జగర్లా మహేష్ , వినోద్, గుండవెని అంజయ్య, దుంపేట తిరుపతి, బీమా మల్లేశం, చిక్యాల శోబన్ రావు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: