ప్రభుత్వం అన్న మాటను నిలబెట్టుకుంది ** ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ *

Published: Friday September 23, 2022
ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 21 (ప్రజాపాలన, ప్రతినిధి) : ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేయడం జరుగుతుందని ఎంపీపీ అరిగేల మల్లికార్జున్ గుర్తు చేశారు. బుధవారం మండలంలోని చిర్రకుంట గ్రామ పంచాయతీలలో పాత పెన్షన్ వారికి కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పెన్షన్ అనేది ఆశలేని వారికి కొండంత అండగా ఉంటుందని దాన్ని గుర్తించిన ప్రభుత్వం 57 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ నిర్ణయం పై ప్రకటన చేయడంతో పాటు అమలులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శంకర్, సర్పంచ్ పార్వతీ బాయి, సెక్రటరీ గౌతమ్, నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
 
 
 
Attachments area