ఇంటింటికి తిరిగి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

Published: Friday February 11, 2022
మధిర ఫిబ్రవరి 10 ప్రజాపాలన ప్రతినిధి : మధిర  మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు అందజేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజుమండలంలోని మల్లవరం వెంకటాపురం వంగవీడు కాజీ పురం నాగవరప్పాడు సిద్దినేని గూడెం తదితర గ్రామాలలో ఐదు లక్షల 94 వేల ఐదు వందల రూపాయలు విలువచేసే10 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను లబ్ధిదారులకు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు చేతుల మీదగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి, కోన నరేందర్ రెడ్డి, పిడికిటి సాంబశివరావు, కటికల సీతారామిరెడ్డి, అబ్బూరి రామన్, వాల్మీకి పవన్, వెంకటాపురం సర్పంచ్ దీరవత్ లక్ష్మి, సర్పంచ్ బొగ్గులు పద్మావతి, సర్పంచ్ పెద్ద బుచ్చయ్య, వేమిరెడ్డి పెద్ద నాగిరెడ్డి, తాళ్లూరి సురేష్, ఆయా గ్రామ ఎంపిటిసిలు పాల్గొన్నారు.