మట్టిలో మాణిక్యం ఈ దివ్యమూర్తి ..

Published: Wednesday August 25, 2021

పాలేరు ఆగస్టు 24 (ప్రజాపాలన ప్రతినిధి) : మట్టిలో మాణిక్యం జ్ఞాపకశక్తి ఉంటే మనము ఏదైనా గుర్తుపెట్టుకోగలము. జ్ఞాపకశక్తి ఉండడం ద్వారా ఎంతటి విజయాలనైనా సాధించగలం. పైన కనిపిస్తున్న వ్యక్తి జ్ఞాపకశక్తి కి పెట్టిన పేరు లాగా వవహరిస్తున్నారు. ఇతని పేరు గుగ్గిళ్ళు దివ్యమూర్తి వయసు 26 సం" నేలకొండపల్లి మండల పరిధిలోని కొత్త కొత్తూరు నివాసి. తండ్రి గుగ్గిళ్ళు ముత్తీ లింగం, దినసరి కూలి, తల్లి రమాదేవి గృహిణి,ఇతని ప్రత్యేకత  ఏమిటి అంటే ఏ విషయాన్ని చూయించినా వెంటనే గుర్తుపెట్టుకోగలడు సెకండ్ లలో గుర్తు పెట్టుకోగలడు. గతంలో అనేక పోటీ పరీక్షలలో మొదటి  స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అంతటి జ్ఞాపకశక్తి కలవాడు. తన ఫోన్ లోఫోన్ బుక్ ఉండదు ఒక్క  నెంబర్ కూడా సేవ్  చేసుకొడు. ఇతను తెలంగాణాలో ఉన్న జిల్లాల పేర్లు 5 సెకన్లలో చెప్తాడు. మరియు రాష్ట్రాల పేర్లు 4 సెకండ్ లలో చెప్తాడు. ప్రపంచంలో అన్ని దేశాల పేర్లు నిమిషంలోపు చూడకుండా చెప్పగల సమర్థుడు. అనేక పుస్తకాలు దాదాపు 2130 పైన పుస్తకాలు చదివారు. ఇతను మిమిక్రీ మరియు పాటలు కూడా పాడతారు. ఇతనికి అనేక రకాల విషయాల గురించి మరియు పరిపాలకులు గురించి క్షుణ్నంగా వివరించగలరు. ఇక ఇతని చదువు ప్రస్థానం నేలకొండపల్లి మండలం మరియు గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్నారు. ఇంటర్మీడియట్ గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. మరియు బీటెక్ ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలో బొమ్మ కళాశాల యందు బీటెక్ పూర్తి చేశారు. ఇంతటి జ్ఞాపక శక్తి గల వ్యక్తిని చూసి నేలకొండపల్లి మండల ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.