స్వామిఅయ్యప్ప దేవాలయంఆలయంలో మండల పూజలు

Published: Monday November 21, 2022
మధిర  నవంబర్ 20 (ప్రజా పాలన ప్రతినిధి) మధిర పట్టణంలోని అయ్యప్ప నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో ఆదివారం జరిగిన ఉదయాస్తాం  పూజలో శీలం చెన్నారెడ్డి దంపతులు పాల్గొని. స్వామివారి 15వ మండల పూజల్లో భాగంగా ఆలయంలో ఈ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈరోజు అన్నదాత అయ్యప్ప స్వామి భక్తులకు పోలూరు శ్రీకృష్ణ దంపతులు శ్రీధర్ స్వామి కుటుంబ సభ్యులు, మాలధారులకు వారు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు  మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పేదవాడి ఆకలి తీర్చేందుకు ప్రతి ఒక్కరూ అన్నదానాలు చేయాలన్నారు ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప శివ గోపయ్య స్వామి గోవిందా భవాని మాలదారులకు అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు మా కుటుంబం సభ్యులతో ఈ కార్తీకమాసం ఆదివారం నాడు స్వామి అయ్యప్ప దేవాలయంలో అన్నదానం చేయటం స్వామి అయ్యప్ప దీవెనలు అందరికీ ఉండాలని అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కావాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చలవాది శ్రీనివాస్ ధర్మారావు అర్చకులు గురుస్వామి బత్తుల శ్రీనివాసరావు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాస్ చెరుపల్లి శ్రీధర్  మైనీడి జగన్మోహన్ రావు పుల్లారావు అప్పారావు భక్తులు అయ్యప్పలు స్వాములు తదితరులు పాల్గొన్నారు.