సీఎం కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి : బీజేపీ
Published: Friday February 04, 2022
సారంగాపూర్, ఫిబ్రవరి 03 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల కేంద్రంలో బీజేపీ ధర్నా రాస్తారోకో చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగాన్ని మార్చాలని అవమానించిన సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా సారంగాపూర్ మండల కేంద్రంలో బీజేపీ భీం దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు ఎండబెట్ల వరుణ్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్నీ మార్చాలనే కుట్ర ఆలోచన కలిగి ఉన్న కేసీఆర్ వెంటనే తన సీఎం పదవికి రాజీనామా చేసి నిరూపించుకోవలని రాజ్యాంగం యొక్క గౌరవాన్ని కాపాడలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారత రాజ్యాంగం పాత్ర ఎంత కీలకమో కేసీఆర్ మర్చిపోయారా అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కంచర్ల నరేష్ ఆనంతుల స్వామి కంపెళ్లి శేఖర్ మండల ఎస్సీ నాయకులు పాల్గొన్నారు.
Share this on your social network: