రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
Published: Friday June 18, 2021
జిన్నారం, జూన్ 17, ప్రజాపాలన ప్రతినిది : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. బొల్లారం సే ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం హనుమాన్ దేవాలయం బాచుపల్లి కి వెళ్ళే దారిలో బైక్ను స్కూటీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకిస్ట్ సొరకాయ రాజేశ్వరరావు (35) అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతుడు స్థానిక పోచమ్మ బస్తీకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కాగా స్కూటీపై వెళుతున్న ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ ముగ్గురు క్షతగాత్రులను సమీపంలోని మమత ఆస్పత్రికి తరలించారు. రాజేశ్వరరావు మృతదేహాన్ని పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. స్థానికుల వివరాల ప్రకారం అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావించారు. సిఐ ప్రశాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Share this on your social network: