కరోనాను అరికట్టడానికి ప్రజలు సహకరించాలి : కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావు

Published: Monday May 10, 2021
మేడిపల్లి, మే9 (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా వైరస్ వ్యాప్తి రెండోదశలో విజృంభిస్తున్న తరుణంలో వైరస్ ను అరికట్టడానికి ప్రజలు సహకరించాలని రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు విజ్ఞప్తి చేశారు. వైరస్ వ్యాప్తి అరికట్టడంలో ముందస్తు చర్యల్లో భాగంగా డివిజన్లోని శ్రీనగర్ కాలనీలో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు పిచికారి చేయించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కరోనా పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ, ముఖాలకు మాస్క్లు, భౌతిక దూరాన్ని పాటించాలని తెలిపారు. సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ ను అరికట్టడంలో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీజేపీ అధ్యక్షుడు  బండారు వెంకట్రావు, బీజేవైఎం డివిజన్ ప్రధాన కార్యదర్శి శైలేందర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు పరివేద వెంకటేశ్వరరావు, ఆది సత్యనారాయణ, రావి యాదగిరి రెడ్డి, రాంబ్రహ్మం,వేముల వెంకట్ రెడ్డి, సందీప్ పాల్గొన్నారు.