వేసవి దాహార్తి తీర్చిన ఆరో వార్డు మునిసిపల్ కౌన్సిలర్వరలక్ష్మి ఓంకార్

Published: Thursday April 14, 2022
మధిర ఏప్రిల్ 13 ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ పరిధిలోని బుధవారం నాడు అన్నాయిపాలెం గ్రామములో వేసవి లో నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి   జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆదేశానుసారం మున్సిపాలిటీ చైర్ పర్సన్ మరియు కమిషనర్ సూచనల మేరకు మధిర మున్సిపాలిటీ ఆరో వార్డు నందు కౌన్సిలర్ వరలక్ష్మి ఓంకార్ బోరు భావి వేయించారు మరియు రోడ్డుకు ఇరువైపుల ముళ్ళకంప, పిచ్చి మొక్కలను జెసిబి తో శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వార్డు ఇన్చార్జి ఓంకార్ విజయ్ కుమార్ శ్రీను అప్పారావు తదితరులు పాల్గొన్నారు