విజయపురి కాలనీ నూతన కార్యవర్గం ఎన్నిక

Published: Wednesday January 25, 2023
మేడిపల్లి,జనవరి 24 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్ డివిజన్ పరిధిలోని విజయపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికయింది. ఈ మేరకు  విజయపురి కాలనీ కమ్యూనిటీ హాల్లో 
 ప్రస్తుత అద్యక్షులు ప్రనీల్ రెడ్డి అధ్వర్యంలో సర్వసభ్య సమావేశాన్ని  నిర్వహించి, నూతన కమీటీనీ కాలనీ వాసుల సమక్షంలో  ఏకగ్రీవ నిర్ణయం తీసుకొని కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా వరకల భుజేందర్ గౌడ్ ,అధ్యక్షులుగా పెసరకాయల ప్రభాకర్ రెడ్డి ,ప్రధాన కార్యదర్శిగా గోటికే రవీందర్ రెడ్డి ,
ఉపాధ్యక్షులుగా ఉమాదేవి,కోశాధికారిగా అరవింద్ గౌడ్ ,సంయుక్త కార్యదర్శిలుగా రఘు, పెండ్యాల సత్యనారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శిగా పాలకూరి మణికంఠ గౌడ్, సలహాదారులుగా  మోచా సురెష్ ,కొల్లు బాలరాజ్, కట్ట జనార్దన్ రెడ్డి , ఆవుల జంగా రెడ్డి , దేశం వెంకటేశ్ గౌడ్ , పొట్లూరి గురుమూర్తి లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ కాలనీ సభ్యుల ఆమోదం మేరకే నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కాలనీ సభ్యుల సలహా సూచన మేరకే నూతన కమిటీ పని చేస్తుందని పేర్కొన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన ఈ నూతన కమిటీ కాలనీ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని వెల్లడించారు.