శేరిలింగంపల్లి -ప్రజాపాలన /జూలై 21

Published: Friday July 22, 2022

శేరిలింగంపల్లి పరిధిలోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో జరుగుతున్న పలు అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని గురువారం జర్నలిస్ట్ బృందం జోనల్ కమిషనర్ శంకరయ్య సార్

కు పత్రాన్ని అందజేశాము.ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ మాట్లాడుతూ అక్రమ కట్టడాలను నిర్మించుకుంటూ పోతుంటే తమ దృష్టికి వచ్చిన అక్రమం కట్టడం అని రుజువైతే ఎంతటి వారైనా అట్టి కట్టడాలపై చర్య లు తప్పనిసరిగా తీసు కుంటా మని తెలిపారు. ఆయా పత్రికలలో వచ్చిన అక్రమ కట్టడాలపై వార్తలతోపాటు జర్నలిస్ట్ బృందం ఇచ్చిన ఫిర్యాదును తక్షణమే సంబంధిత విభాగాలకు పంపించి ఒకటి రెండు రోజులలో చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు జోనల్ కమిషనర్ శంకరయ్య సార్ తెలియ జేశారు. అక్రమ కట్టడాలపై ఫిర్యాదును అందజేసిన వారిలో శేర్లింగంపల్లి జర్నలిస్ట్ బృందం పాల్గొన్నారు.
 
 
 
Attachments area