సబ్ స్టేషన్ లో లైన్మెన్ ల పరిస్థితి

Published: Friday August 27, 2021
ఎర్రుపాలెం, ఆగష్టు 26, ప్రజాపాలన ప్రతినిధి : ఎర్రుపాలెం మండలం సబ్ స్టేషన్ లో గల లైన్మెన్ ల పరిస్థితి.పేరుకి లైన్ మెన్ అనిచెప్పి ప్రైవేట్ వ్యక్తుల చేత పని చేయించుకుంటూ వారికి జీతాలు లేక వారి ప్రాణాలతో చెలగాటం చేస్తూ, తిన్నామా, పడుకున్నావా, తెల్లారిందా అని చూస్తూ ఉన్నటువంటి లైన్ మెన్లు.లైన్ లో ఫెయిల్ అయినా ట్రాన్స్ఫారం ఫెయిల్ అయిన లైన్ మెన్ చూడకుండా ప్రైవేటు వ్యక్తులను పంపించి అది చూడు అని చెబుతున్న లైన్ మెన్.మరి వారి ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తున్నటువంటి ప్రైవేటు వ్యక్తులు అనే పట్టించుకునే వారు ఎవరు?వేలవేల జీతాలు తీసుకుంటూ ప్రైవేటు వ్యక్తులతో చాకిరీ చేస్తున్నటువంటి లైన్మెన్ లు మరి వారి ప్రాణాలకు ఎవరు బాధ్యత వహించాలి? కరెంటు స్తంభం ఎక్కాలంటే ప్రైవేట్ వ్యక్తులు కావాలి. మరి లైన్ మెన్ కి జీతం ఎందుకు ఇవ్వాలి? ప్రభుత్వం తక్షణమే సమస్యకు పరిష్కారం ఇవ్వాలి. ఇది ఎర్రుపాలెం మండల కరెంటు లైన్ మెన్ నా దగ్గర పనిచేసే ప్రైవేటు వ్యక్తుల పరిస్థితి.