అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను వేంటనే పుర్తి చేయాలి

Published: Friday May 28, 2021
- కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : చందానగర్ డివిజన్ పరిధిలో పలు కాలనీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు అసంపూర్తిగా కోనసాగుతున్నాయాని వాటిని వెంటనే పుర్తి చేయాలని చందానగర్ మున్సిపల్ అధికారులతో స్థానిక కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి సమిక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పోరేటర్ మాట్లాడుతూ రాబోయే వర్షా కాలంలోపు డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పలు కాలనీలలో మ్యాన్ హోల్స్ నుంచి మురుగు నీరు పోంగి రోడ్లపై ప్రవహిస్తుందని, అలాంటి ప్రాంతాల్లో మరమ్మతు పనులు చేపట్టి అవసరమైన చోట కోత్త మ్యాన్ హోల్స్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. లేనిపక్షంలో వర్షాకాలంలో వరదనీరు రోడ్ల పైకి చేరుతుందన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చందానగర్ మున్సిపల్ ఈఈ శ్రీకన్య, డీఈ రూపదేవి తదితరులు పాల్గొన్నారు.