ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 11ప్రజాపాలన ప్రతినిధి *ఫ్రెండ్స్ చికెన్ సెంటర్ ప్రారంభానికి ముఖ్య అ

Published: Thursday January 12, 2023

ఇబ్రహీంపట్నం మండల కేంద్రం కృష్ణవేణి లెన్ ఎం బీ ఆర్ నగర్ లో పోల్కంపల్లి గ్రామానికి చెందిన కావలి రకేష్ ఫ్రెండ్స్ చికెన్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా పోల్కంపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ హాజరై రకేష్, రోహిత్, నాగరాజు, శివ కృష్ణ తో కలిసి ప్రారంభించారు. వారిని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గూడెం శ్రీనివాస్ మాట్లాడుతూ... యువత స్వయం శక్తితో స్వయం ఉపాదితో ముందుకు సాగాలని అన్నారు. యువత ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు అని, సంకల్పం, బలంగా ఉంటే భవిష్యత్తు యువతదేనని అన్నారు. ఒకవైపు అమెజాన్ లో ఉద్యోగం కొనసాగిస్తూ మరో పక్కా స్వయం ఉపాది వైపు మొగ్గుచూపడం హర్శించదగ్గ విషయమని అన్నారు. యువకులు ఉద్యోగం కోసం నిరీక్షిస్తూ సమయాన్ని వృధా చేసుకోకుండా స్వయం ఉపాధి రంగాలలో రాణించాలని అన్నారు. ఉపాది పొందటంతో అటు నలుగురికి కల్పించిన వరవుతారని, యువత స్వయం ఉపాధి వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా ఎదగలన్నారు. ఈ కార్యక్రమంలో  పొన్నాల శివ ప్రసాద్, సొప్పరి కిషోర్, యువత పాల్గొన్నారు.