నూతన దంపతులను ఆశీర్వదించిన గణేశుల రవి

Published: Tuesday April 19, 2022
తల్లాడ, ఏప్రిల్ 18 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని పాత మిట్టపల్లి గ్రామానికి చెందిన జంగా సిద్ధారెడ్డి కుమారుడు హరీష్ రెడ్డి, పద్మావతి దంపతుల వివాహం ఆదివారం రాత్రి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరులు, టిఆర్ఎస్ పార్టీ తల్లాడ మండల నాయకులు గణేషుల రవి హాజరై నూతన దంపతులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో, పిల్లాపాపలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నాయకులు పొట్రూ శ్రీనివాసరావు, ఎస్.కె, మహబూబ్, బానోతు నాగేశ్వరరావు, బానోతు నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.