సర్పంచులకు కరోనా టీకా వేయాలి

Published: Tuesday June 08, 2021

జన్నారం, జూన్ 7, ప్రజాపాలన ప్రతినిధి : మండలంలోని సర్పంచులు అందరికీ ఎలాంటి వయో పరిమితి లేకుండా ఫ్రంట్ వారియర్స్గా గుర్తించి కరోన టీకా వేయాలని సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షుడు జిడి గంగాధర్ డిమాండ్ చేశారు. సోమవారం ఎంపీడీవో అరుణ రాణి కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచులు ప్రతిరోజు ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేపడుతూనే ప్రజలతో కలసిమెలసి ఉండడం జరుగుతుందని అందుకే సర్పంచులను ఫ్రంట్ వారియర్స్గా గుర్తించి వారికి ఎలాంటి వయో పరిమితి లేకుండా కరోన టీక వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కాల్ రామ్, జక్కు భూమేష్, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..