ప్రతి ఒక్కరు బాధ్యతగా మాస్కు ధరించాలి... రూరల్ ఎస్ఐ రమేష్ కుమార్
Published: Wednesday April 28, 2021
మధిర, ఏప్రిల్ 27, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం లోని మాటూరు రోడ్ల రూరల్ ఎస్ఐ రమేష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూeసెకండ్ వ్వే విజృంభిస్తున్న తరుణంలో గ్రామాలలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ గుంపులు గుంపులుగా ఉండవద్దని పలు గ్రామాలలో ప్రజలకు సూచించారు. చదువుకున్న యువత గ్రామంలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా కరోనా వైరస్ గురించి వివరించాలన్నారు. హాస్పిటల్స్లో ఆక్సిజన్ కొరత ఉందని ఎవరు వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో మాటూరు సర్పంచ్, గ్రామ ప్రజలు, రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: