రక్తం దానం చేయండి.. ప్రాణాలను రక్షించండి

Published: Wednesday October 27, 2021
టిఆర్ఎస్ పట్టణ కార్యదర్శి జుంజురు ప్రదీప్ 
వికారాబాద్ బ్యూరో 26 అక్టోబర్ ప్రజాపాలన : రక్తం దానం చేయండి ప్రాణాలను రక్షించండి అని టిఆర్ఎస్ పట్టణ కార్యదర్శి జుంజురు ప్రదీప్ (దీపు) పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా ఎస్పి కార్యాలయంలో ఎస్ పి ఎం.నారాయణ అధ్యక్షతన నిర్వహించిన రక్తదాన శిబిరంలో 17వ వార్డుకు చెందిన మహమ్మద్ సిరాజ్, ఆనంద్, శ్రీనివాస్, రఫీ, అఖిలేష్, అలీమ్ లు జుంజురు ప్రదీప్ (దీపు) ఆధ్వర్యంలో రక్తం దానం చేశారు. ఈ సందర్భంగా జుంజురు ప్రదీప్ మాట్లాడుతూ..ప్రమాదాలతో తీవ్ర రక్తగాయాలైనప్పుడు రక్తం ఆవశ్యకత ఉంటుందని గుర్తు చేశారు. సమయానికి రక్తం అందకపోతే ప్రాణాలు గాలిలో కలిసే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు రక్తం దానం చేయడానికి స్వతహాగా ముందుకు రావాలని హితవు పలికారు. రక్తం ఇచ్చిన వ్యక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు, బలహీనులు కారని సూచించారు. అన్ని దానాలలో కంటే రక్తదానం గొప్పదని స్పష్టం చేశారు. ఆపత్కాలంలో ఆదుకున్న వాడే ఆపద్బాంధవుడవుతాడని వివరించారు. జిల్లా పోలీసు యంత్రాంగం రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. పోలీసులు భద్రత చర్యలు చేపట్టడమే కాకుండా సామాజిక సేవా రంగంలో పాల్గొనడం ప్రశంసనీయం అన్నారు.