మచ్చ గంగారాం కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి - ఎల్ రమణ
Published: Wednesday August 11, 2021
జగిత్యాల, ఆగస్టు 01 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలో పద్మశాలి సేవా సంఘం మాజీ అధ్యక్షులు, రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మచ్చ గంగారాం అకాల మరణం చెందినారని విషయాన్ని తెలుసుకొని మాజీ మంత్రి ఎల్.రమణ మచ్చ గంగారాం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈసందర్భంగా ఫోన్ లో మాట్లాడుతూ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడుగా మచ్చ గంగారాం ఎన్నో సేవలు చేసారని, వ్యక్తి గతంగా చాలా దగ్గరగా వుండే వారని గుర్తు చేశారు.
Share this on your social network: