సాయిబాబా ఆలయం వద్ద ఆక్రమణలను తొలగించండి : జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి
Published: Wednesday June 16, 2021
మేడిపల్లి, జూన్ 15, (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్లోని జాతీయ రహదారి నల్లచెరువు వద్ద సాయిబాబా ఆలయం పక్కన జరిగిన ఆక్రమణలను వెంటనే తొలగించాలని జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి సర్కిల్ అధికారులను ఆదేశించారు. ఉప్పల్ డివిజన్లో జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ఎస్ఈ అశోక్ కుమార్, ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి ప్రజా సమస్యలపై విస్తృతంగా పర్యటించారు. ఉప్పల్ నల్లచెరువు వద్ద సాయిబాబా ఆలయం పక్కన జరిగిన ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అనంతరం కూరగాయల మార్కెట్ లోనూ వర్షపు నీటి నిల్వలు, డ్రైనేజీ సమస్యలను పరిశీలించి వెంటనే కావాల్సిన చర్యలు చేపట్టాలని సూచించారు. న్యూశాంతినగర్లో జరుగుతున్న నాలాల పూడికతీత పనులను పరిశీలించి సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అరుణ కుమారీ, ఈఈ నాగేందర్, టిపిఒ మౌనిక, మున్సిపల్ సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: