మైనారటిల అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం 'బీఆర్ఎస్' యం ఎల్ ఏ మెచ్చా

Published: Wednesday April 19, 2023
అశ్వారావుపేట ప్రజాపాలన (ప్రతి నిధి) ముస్లిం సోదరులు అతిపవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రంజాన్ తోఫాను అశ్వారావుపేట యం ఆర్వో కార్యాలయంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి అశ్వారావుపేట యం ఎల్ ఏ మెచ్చా నాగేశ్వరరావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనారటిల అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం బి ఆర్ ఎస్ ప్రభుత్వమని.ఐదు మండలాల్లో షాది ఖనాల ఏర్పాటు కొరకు నిధులు కేటాయించాలని మంత్రి గారి ని కలిసి కోరడం జరిగిందనీ త్వరలో అవి కూడా మంజూరు అవుతాయని.అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మరవకూడదని,రానున్న రోజుల్లో మరో సారి ఆశీర్వదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి,జెడ్పీటీసీ చిన్నసెట్టి వరలక్ష్మి,వైస్ ఎంపీపీ ఫణీంద్ర, ఎంపీటీసీభారతి,సర్పంచ్,ప్రజా ప్రతినిధులు మందపాటి రాజమేహన్ రెడ్డి,జెకేవి రమణారావు, నార్లపాటి రాములు, జుజ్జారపు రాంబాబు, సంపూర్ణ, సూర్య ప్రకాష్ రావు, శ్రీను,మోటూరి మోహన్, ముస్లిం పెద్దలు ఆసీఫ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.