మాల్సూర్ తండాలో ఆరెంజ్ మ్యాంగో ఫ్రూట్ మార్కెట్ ప్రారంభం

Published: Wednesday April 06, 2022
తల్లాడ, ఏప్రిల్ 5 (ప్రజాపాలన న్యూస్) : తల్లాడ మండలంలోని మాల్సూర్ తండా గ్రామ ప్రధాన రహదారి పక్కన ఆరెంజ్ మ్యాంగో ఫ్రూట్ యార్డ్ సోమవారం రాత్రి ప్రారంభమైంది. కల్లూరు, తల్లాడ మండలాలకు సుపరిచితులు షేక్. రఫీ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ యార్డును నిర్వహిస్తున్నారు. యార్డులో జిల్లాలోని ఎక్కడాలేని విధంగా నాగ్ పూర్ నుండి (బాబ్ల్యూ బాయ్), రాజస్థాన్ నుండి (పునీత్ కిల్వానీ) బడా వ్యాపారులు ప్రత్యేకంగా వచ్చి మామిడి కాయలను రైతులకు సరసమైన ధరలకు కొనుగోలు చేస్తున్నారు. దళారులకు ఎవరికి ఎటువంటి కమిషన్లు ఇవ్వకుండా వ్యాపారులే ఇక్కడకి వచ్చి మామిడి కాయలను కొనుగోలు చేస్తున్నారు. తల్లాడ మండలం లోని అంజనాపురం, మల్సూర్ తండా, లక్ష్మతండ గ్రామాల్లో ఈ యార్డులను నిర్వహిస్తున్నారు.
నమ్మకంతో వచ్చి మంచిధరను పొందండి..
ఆరెంజ్ యార్డు అధినేత రఫీ..
తల్లాడ, కల్లూరు రైతులతో పాటు జిల్లాలోని రైతులందరూ తమ సరుకును తీసుకొచ్చి అధిక ధరలు పొందాలని ఆరెంజ్ యార్డ్ అధినేత షేక్. రఫీ సూచించారు. ఎవరికీ ఎటువంటి కమీషన్లు ఇవ్వకుండా సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడికే ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. గతంలో హైదరాబాద్, వరంగల్, నాగపూర్, ముంబై తదితర సుదూర ప్రాంతాలకు రైతులు వెళ్లేవారని, ప్రస్తుతం అక్కడకు వెళ్ళకుండా ఇక్కడకే వారు వచ్చి కొనుగోలు చేస్తున్నారని వెల్లడించారు. రైతులు నమ్మకంతో వచ్చి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు. జిల్లాలోని రైతులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.